News March 13, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డ ప్రమాదం వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా నర్సంపేట కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. నర్సంపేట గ్రామానికి చెందిన వనం రాజు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 9, 2026
వేములవాడ: భీమేశ్వరుడికి కోటిన్నర ఆదాయం

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి వారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. గత 15 రోజులకు గాను హుండీ ద్వారా రూ.1,15,17,894 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. నగదుతో పాటు 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండిని భక్తులు మొక్కుబడిగా చెల్లించుకున్నారు. ఈవో పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో హుండీ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.
News January 9, 2026
సిరిసిల్ల: ‘వృద్దుల డే కేర్ సెంటర్లో అన్ని వసతులు కల్పించాలి’

వృద్ధుల డే కేర్ సెంటర్లో అన్ని వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్లో వృద్ధుల డే కేర్ సెంటర్ను త్వరలో ప్రారంభించనుండగా, ఇన్ఛార్జ్ కలెక్టర్ శుక్రవారం పరిశీలించి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధులకు ఏర్పాటుచేసిన క్యారంబోర్డ్స్, చెస్ తదితర ఆట వస్తువులను పరిశీలించారు.
News January 9, 2026
పల్నాడు: కోడి పందేలపై కలెక్టర్ హెచ్చరిక

కోడి పందేలు నిర్వహిస్తే జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కృతిక శుక్లా హెచ్చరించారు. కోడి పందేలు నివారణపై కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ కృష్ణారావుతో కలిసి నిర్వహించారు. పందేలు జరిగే అవకాశాలున్న ప్రాంతాలపై నిఘా పెట్టాలని, అన్ని గ్రామాల్లో దండోరా వేయించి హెచ్చరిక జారీ చేయాలని ఆదేశించారు. పందేలు నిర్వహిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బైండోవర్ చేయాలన్నారు.


