News March 11, 2025

సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీ

image

సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులు జారీచేశారు. రాయపోల్ తహశీల్దార్ జీ. దివ్యను కొమురవెల్లికి, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ డీఏఓ ఐ. శ్రీనివాస్‌ను రాయపోల్ తహసీల్దార్‌గా, జగదేవపూర్ తహశీల్దార్ ఎం. కృష్ణమోహన్‌ను సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ డీఏఓగా బదిలీ చేశారు. జగదేవపూర్ డీటీ రఘువీర్ రెడ్డికి జగదేవపూర్ తహసీల్దార్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు.

Similar News

News October 17, 2025

వైట్ హెడ్స్ రాకుండా ఉండాలంటే?

image

ముక్కుపై చర్మరంధ్రాలు పెద్దగా ఉండటంతో నూనెలు, మృతకణాలు చేరి వైట్‌హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వీటికి కారణమంటున్నారు నిపుణులు. వీటిని తొలగించడానికి మినరల్ కాస్మెటిక్స్, టోనర్‌, మైల్డ్‌ క్లెన్సర్‌ వాడాలి. వారానికి 3సార్లు తలస్నానం చేయాలి. ఫోన్‌, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. మేకప్ ప్రొడక్ట్స్ ఎవరితోనూ పంచుకోకూడదు. అయినా తగ్గకపోతే వైద్యుల సలహాతో యాంటీ బయాటిక్స్ వాడాలి.

News October 17, 2025

ప్రతి మండలానికి లైసెన్సుడ్ సర్వేయర్లు: శ్రీనివాసరెడ్డి

image

TG: భూసేవలు సులభంగా అందేలా మండలానికి 4-6 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమలుకు ఇపుడున్న 350 మంది సర్వేయర్లు సరిపోరని అందుకే కొత్తగా 3465 మందిని తీసుకున్నామని చెప్పారు. శిక్షణ పొందిన వీరికి ఈనెల 19న CM ద్వారా లైసెన్సులు అందిస్తామని చెప్పారు. మరో 3వేల మందికి JNTU అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, ఎంపికైన వారికి అప్రెంటీస్ శిక్షణ ఉంటుందన్నారు.

News October 17, 2025

దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

image

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.