News March 1, 2025
సిద్దిపేట జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

సిద్దిపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సిద్దిపేటలో 32 నుంచి 33 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 34 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 12, 2025
పాక్ కోర్టు ఆవరణలో దాడి మా పనే: జమాత్ ఉల్ అహ్రార్

పాకిస్థాన్లోని కోర్టు ఆవరణలో <<18258453>>పేలుడు<<>> తమ పనేనని నిషేధిత ఉగ్రవాద అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. పాకిస్థాన్లో చట్ట వ్యతిరేక తీర్పులు జారీ చేసే జడ్జిలు, లాయర్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దేశంలో ఇస్లామిక్ షరియా అమలులోకి వచ్చే వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ సంస్థ గతంలో TTP అనుబంధ సంస్థగా ఉంది.
News November 12, 2025
ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

2002లో నమోదైన ఓటర్ల జాబితాను ప్రస్తుతం(2025) ఉన్న ఓటర్లతో పాటు వారి సంతానంలో ఉన్న ఓటర్లను ఎస్ఐఆర్లో సరిపోల్చడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్డీవోలు/ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రానున్న రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సమావేశం నిర్వహించారు.
News November 12, 2025
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి: DSP

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.


