News February 12, 2025

సిద్దిపేట: జిల్లాలో రెండవ విడత రైతుభరోసా విడుదల

image

సిద్దిపేట జిల్లాలో రెండవ విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,86,241 మంది రైతుల ఖాతాల్లో రూ.116 కోట్ల 26 లక్షల 24 వేల 246 నగదు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం రెండో విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది.

Similar News

News November 28, 2025

దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.

News November 28, 2025

జగిత్యాల: ‘రూ.50వేల లోపు నగదుకే అనుమతి’

image

ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 3 ఎస్‌ఎస్‌టీ, 20 ఎఫ్‌ఎస్‌టీ టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నియమాల ప్రకారం 50 వేల రూపాయలలోపు నగదు మాత్రమే అనుమతించబడుతుందని, అంతకంటే ఎక్కువైతే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

News November 28, 2025

NRPT: ‘ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి’

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08506-283122కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రాజకీయ నాయకులు, అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళి పాటించాలని ఆమె స్పష్టం చేశారు.