News January 28, 2025

సిద్దిపేట: జిల్లాలో 31,170 మందికి రైతు భరోసా జమ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 31,170 రైతులకు రైతు భరోసా నిధులు జమ అయినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక ప్రకటనలో పేర్కొన్నారు.రైతు భరోసా పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రూ.36.40 కోట్లు జమ అయినట్లు తెలిపారు.జిల్లాలోని 28 మండలల పరిధిలో ఒక్కో గ్రామం చొప్పున డబ్బులు జమ అయ్యాయని, మిగతా వారికి త్వరలోనే జమ కానున్నాయని తెలిపారు.

Similar News

News November 15, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. తుమ్మల వ్యూహం సక్సెస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తుమ్మలను సీఎం రేవంత్ వెంగళరావు నగర్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కమ్మ కీలక నేతలను సీఎం రేవంత్ రెడ్డితో సమావేశపరిచి, హామీలు ఇప్పించారు. ఈ సామాజిక సమీకరణాల ద్వారానే కాంగ్రెస్ విజయం సాధించిందని, తుమ్మల వ్యూహం ఫలించిందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్.

News November 15, 2025

కుప్పం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం కావడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 9000716436, 80740 8806 నంబర్‌కి సమాచారం తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.

News November 15, 2025

నేడు జగిత్యాలతో లక్ష దీపోత్సవం

image

జగిత్యాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగనున్న లక్ష దీపోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని రాష్ట్ర సంపర్క సభ్యుడు వేముల సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని ఈసారీ యథావిధిగా గీత విద్యాలయం గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.