News January 28, 2025
సిద్దిపేట: జిల్లాలో 31,170 మందికి రైతు భరోసా జమ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 31,170 రైతులకు రైతు భరోసా నిధులు జమ అయినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక ప్రకటనలో పేర్కొన్నారు.రైతు భరోసా పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రూ.36.40 కోట్లు జమ అయినట్లు తెలిపారు.జిల్లాలోని 28 మండలల పరిధిలో ఒక్కో గ్రామం చొప్పున డబ్బులు జమ అయ్యాయని, మిగతా వారికి త్వరలోనే జమ కానున్నాయని తెలిపారు.
Similar News
News February 7, 2025
NRML: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 7, 2025
బీసీ, ఈబీసీలకు శుభవార్త

AP: స్వయం ఉపాధి కోసం BC కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 12 వరకు పొడిగించింది. అర్హులైన BC, EBCలు అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సవిత సూచించారు. కుట్టు శిక్షణ, కోళ్లఫారాలు, పాడి, ఫొటో స్టూడియోలు, జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు, బ్యూటీపార్లర్లు తదితర యూనిట్లకు రూ.2-5లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% సబ్సిడీ లభిస్తుంది.
వెబ్సైట్: <
News February 7, 2025
AP: బీసీ, ఈబీసీలకు సబ్సిడీ రుణాలు.. అర్హతలివే

✒ వయసు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి. వార్షికాదాయం పట్టణాల్లో 1.30లక్షలు, గ్రామాల్లో రూ.81వేల లోపు ఉండాలి.
✒ రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే అర్హులు
✒ కావాల్సిన పత్రాలు: వైట్ రేషన్ కార్డు, కుల, వయసు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఫొటో
✒ 1,30,000 మంది బీసీలకు రూ.896 కోట్లు, ఈబీసీ వర్గాలు(బ్రాహ్మిణ్, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు)లకు రూ.384 కోట్లు కేటాయించారు.