News March 18, 2025

సిద్దిపేట జిల్లా ప్రజలారా.. జర జాగ్రత్త

image

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావొద్దని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు.

Similar News

News December 24, 2025

గన్నవరం: వల్లభనేని వంశీ మళ్లీ సైలెంట్.. కేసుల భయమేనా?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెల రోజుల నుంచి యాక్టివ్‌గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఫంక్షన్లు, బాధిత కుటుంబాల వద్దకు వెళ్తూ ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో వంశీ అనుచరులు దాడి చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటీవల వంశీపై మరో కేసు నమోదైంది. దీంతో వారం రోజుల నుంచి వంశీ మళ్లీ సైలెంట్ అయ్యారు. ఆ కేసులో బెయిల్ తీసుకున్న తర్వాత మళ్లీ ఆయన పర్యటించే అవకాశం ఉంది.

News December 24, 2025

BNGR: ఆన్‌లైన్ పరిచయంతో న్యూడ్ కాల్స్.. కట్ చేస్తే

image

ఆన్‌లైన్ పరిచయం ఓ యువకుడిని నిలువునా ముంచింది. భువనగిరికి చెందిన యువకుడికి రాజమండ్రికి చెందిన మరో యువకుడితో సోషల్ మీడియాలో పరిచయమైంది. చాటింగ్‌తో పరిచయం పెంచుకుని న్యూడ్ కాల్స్‌ చేసుకున్నారు. ఆపై రాజమండ్రి వ్యక్తి రూ.2 లక్షలు చేబదులు తీసుకున్నాడు. బాధితుడు తన డబ్బు తిరిగి అడగడంతో.. పాత ఫొటోలు, చాటింగ్ వివరాలతో కూడిన ఫ్లెక్సీని ఇంటి ముందే కడతానని బెదిరింపులకు దిగాడు.

News December 24, 2025

భూపాలపల్లి: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

భూపాలపల్లి జిల్లాలో యాసంగి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ ముగుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు పండిస్తున్న వారికి మాత్రమే భరోసా ఇస్తామని మంత్రి ఇటీవల ప్రకటించారు.