News March 12, 2025

సిద్దిపేట: జ్యోతిష్యం పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్

image

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని మద్దూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీను మాట్లాడుతూ.. జీ టీవీలో జ్యోతిష్యం చెప్తాను అనే ప్రకటన నమ్మి రూ.50 వేలను నారాయణ చారి ఇచ్చాడు. పూజ మధ్యలో ఉంది తిరిగి మరో రూ.50 ఇవ్వాలని చెప్పడంతో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాడు. తిరిగి మళ్లీ డబ్బులు పంపాలని అడగగా 1930ను ఆశ్రయించాడు.

Similar News

News December 9, 2025

విశాఖలో సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

image

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను కలెక్టర్‌ హరేంధిర ప్ర‌సాద్ మంగళవారం ప‌రిశీలించారు. మ‌ధురువాడ ఐటీ హిల్స్‌పై సంద‌ర్శించిన ఆయ‌న కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్ర‌మంలో అక్క‌డి హెలిప్యాడ్‌ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.

News December 9, 2025

ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

image

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

image

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్‌ను వినియోగించుకోవాలన్నారు.