News February 17, 2025

సిద్దిపేట: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

image

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News March 16, 2025

భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

image

భువనగిరి శివారు రాయగిరి నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2025

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు

image

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరులో కిలో స్కిన్ రూ.160, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. ఆదోనిలో స్కిన్ లెస్ రూ.185, స్కిన్ రూ.160కి విక్రయాలు జరిగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లోనూ ఇవే రేట్లు పలుకుతున్నాయి.

News March 16, 2025

మాజీ MLA రాజయ్య హౌస్ అరెస్ట్

image

సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ పర్యటన సందర్భంగా మాజీ MLA తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజయ్య మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సామాన్య ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. దమ్ముంటే అక్రమ అరెస్టులు చేయకుండా జిల్లాలో పర్యటించాలన్నారు.

error: Content is protected !!