News March 27, 2025
సిద్దిపేట: తండ్రి మందలించాడని.. కొడుకు ఆత్మహత్య

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోహెడ (M) రాంచంద్రపూర్కు చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపారి. ప్రశాంత్(19) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ 21న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు KNR ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Similar News
News December 2, 2025
ఉమ్మడి వరంగల్ అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 6 జిల్లాల అండర్-16 క్రికెట్ జట్ల ఎంపిక కోసం ఈ నెల 4న వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ పోటీల ద్వారా జిల్లా జట్టును ఎంపిక చేస్తారని డబ్ల్యూడీసీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. క్రీడాకారులు తప్పక హాజరుకావాలని కోరారు.
News December 2, 2025
గ్లోబల్ సమ్మిట్కు సినీ గ్లామర్

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.
News December 2, 2025
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.


