News February 13, 2025

సిద్దిపేట: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.

Similar News

News March 18, 2025

నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి:  కలెక్టర్ 

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్‌పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు. 

News March 18, 2025

NTR: ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలపై ప్ర‌త్యేక దృష్టి: కలెక్టర్ 

image

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీకి అధికారులు ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో అట‌వీ శాఖ స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీ, హ‌రిత విస్తీర్ణం పెంపు, ఆక్ర‌మ‌ణ‌ల నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు.

News March 18, 2025

చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

image

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.

error: Content is protected !!