News February 23, 2025
సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
Similar News
News March 24, 2025
వైజాగ్-సికింద్రాబాద్ ట్రైన్ అలర్ట్

TG: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లోక్మాన్య తిలక్ , సంబల్ పూర్ సూపర్ ఫాస్ట్, విశాఖ-నాందేడ్, విశాఖ-సాయినగర్ వీక్లీ ఎక్స్ప్రైస్ల రూటు మార్చనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22నుంచి ఈ మార్పులు చేపట్టనున్నారు. దారి మళ్లించడంతో అదనపు ప్రయాణం తమకు భారమవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 24, 2025
ములుగు: కనుమరుగవుతున్న వన్యప్రాణులు!

రాష్ట్రంలోనే అభయారణ్యంగా పేరుగాంచిన ములుగు జిల్లా అడవుల్లో వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. వేటగాళ్ల అమర్చిన ఉచ్చులు, విద్యుత్ తీగలకు బలైపోతున్నాయి. ఏజెన్సీ అటవీ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు అప్పుడప్పుడు జింకలు, దుప్పులు, అడవి బర్రెలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని వన్యప్రాణి ప్రేమికులు వాపోతున్నారు. అటవీ అధికారులు, పోలీసులు వేటగాళ్లపై దాడులు చేసిన తీరు మారడం లేదన్నారు.
News March 24, 2025
సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ వార్

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్భవన్కు పాదయాత్ర చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నాయి. మరి మీ కామెంట్..