News March 4, 2025

సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

image

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్‌లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.

Similar News

News December 16, 2025

నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

image

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

News December 16, 2025

కడెం: ఒకే కుటుంబం.. మూడు సార్లు విజయం

image

ఒక కుటుంబంలో సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం రావడమే కష్టంగా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు సర్పంచ్‌గా గెలిచారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు రాజవ్వ 2013లో, 2019లో ఆమె కొడుకు గంగన్న సర్పంచ్‌గా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రాజేశ్వరి పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

News December 16, 2025

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

image

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.