News March 4, 2025
సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.
Similar News
News December 17, 2025
చౌటుప్పల్: ఒక్క ఓటుతో ఆమె గెలిచింది..!

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థి టేకుల మంజుల, కాంగ్రెస్ అభ్యర్థి అర్థ పల్లవిపై కేవలం 1 ఓటుతో విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
News December 17, 2025
గుంటూరు జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఈవ్ టీజింగ్, బైక్ రేసింగ్ అరికట్టేందుకు పోలీస్ శాఖ బుధవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పలు స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న 260 మంది, బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడుతున్న 214 మందిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
News December 17, 2025
అమరావతి: AGICL ఎండీగా SVR శ్రీనివాస్ బాధ్యతలు

అమరావతి గ్రోత్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) MDగా రిటైర్డ్ IAS అధికారి SVR శ్రీనివాస్ బుధవారం రాయపూడిలోని CRDA కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. AGICL ఎండీగా నియమితులైన SVR శ్రీనివాస్కు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 1989 IAS బ్యాచ్కు చెందిన SVR శ్రీనివాస్ మహారాష్ట్ర క్యాడర్కు చెందినవారు కాగా..పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.


