News February 12, 2025
సిద్దిపేట: త్వరలో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు

కుకునూరుపల్లి హనుమాన్ నగర్కి చెందిన గడ్డం గణేశ్(22) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గణేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఫోన్ మాట్లాడివస్తానని ఇంటి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
Similar News
News December 10, 2025
ఖమ్మంలో కాంగ్రెస్కు ఏకగ్రీవాల జోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.
News December 10, 2025
MDK: ఓటర్ లిస్ట్.. చెక్ చేసుకోండి ఇలా!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ జిల్లాల్లో ప్రతి మండలానికి సంబంధించి గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లిష్ ఫార్మాట్లలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంది. గ్రామం, వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెలుసుకోవడానికి https://finalgprolls.tsec.gov.in వెబ్సైట్ పై క్లిక్ చేయండి. జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. వివరాలు కనిపిస్తాయి.
News December 10, 2025
గ్రేటర్ వరంగల్లో డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు!

గ్రేటర్ వరంగల్ సమీప ప్రాంతాలు మరోసారి విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 డివిజన్లను పెంచాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మడికొండ, రాంపూర్ దాటిన నగరం పెండ్యాల వరకు పెంచాల్సి వస్తోంది. దీంతో పాటు గీసుగొండ, దామెర, ఎల్కతుర్తి, ఐనవోలు వరకు విస్తరణ ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విలీన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.


