News February 25, 2025

సిద్దిపేట: దంచి కొడుతున్న ఎండ

image

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనిపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 25, 2025

హనుమకొండ: మహిళా డీగ్రీ కాలేజీలో సర్టిఫికేట్ కోర్సు

image

వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సృజనాత్మక రచన – పాట అనే అంశంపై సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించారు.ఈ ప్రోగ్రాంలో ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ఫ్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డా.జి.సుహాసిని, తెలుగు విభాగాధిపతి మధు, IQAC కోఆర్డినేటర్ డా.సురేశ్ బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డా.అరుణ, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రత్నమాల, సునీత విద్యార్థులు పాల్గొన్నారు.

News February 25, 2025

పట్టాలెక్కనున్న రవితేజ ‘డబుల్ ధమాకా’?

image

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

News February 25, 2025

త్రిమూర్తులు ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వరం

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్ర నాసిక్ <<15541576>>త్రయంబకేశ్వరం <<>>10వది. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు, ఆదిపరాశక్తితో పాటు బ్రహ్మ, విష్ణు సమేతంగా ప్రత్యక్షమవుతారు. గంగ ప్రవహించేలా చేయమని ముని కోరటంతో తన జటాజూటాన్ని విసరగా అది బ్రహ్మగిరి పర్వతంపై పడి ప్రవాహంగా వచ్చిందనేది స్థలపురాణం. ఆదిపరాశక్తి, త్రిమూర్తులు స్వయంభువుగా వెలియడంతో జ్యోతిర్లింగంగా మారింది. త్రిమూర్తులు ఒకేచోట లింగం రూపంలో ఉంటారు.

error: Content is protected !!