News February 8, 2025

సిద్దిపేట: దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దగా: హరీశ్ రావు

image

దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’లో మండిపడ్డారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు విలువ లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో గందరగోళం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు.

Similar News

News December 9, 2025

చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

image

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.

News December 9, 2025

32,479 సంఘాలకు రుణం ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

image

పొదుపు మహిళలు జిల్లాలో అధికంగా ఉన్నందున 32,479 సంఘాలకు రుణం ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. 10,957 సంఘాలకు రుణాలు మంజూరు కాగా, ప్రస్తుతం 3,979 సంఘాలకు మాత్రమే రూ.604.02 కోట్ల రుణాలు ఇవ్వడం ఏమిటని ఆరా తీశారు. పొదుపు మహిళలకు అధికంగా రుణ సదుపాయం కల్పించాల్సి ఉండగా, ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వకపోవడపై ధ్వజమెత్తారు.

News December 9, 2025

NGKL: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

image

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ఇన్చార్జి ఏఈ వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి ప్రాంతంలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.