News February 8, 2025

సిద్దిపేట: దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దగా: హరీశ్ రావు

image

దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’లో మండిపడ్డారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు విలువ లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో గందరగోళం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు.

Similar News

News February 14, 2026

ఏపీ బడ్జెట్.. రంగాల వారీగా

image

☛ విద్యుత్-రూ.13,934 కోట్లు, ☛ పరిశ్రమలు-₹3,161కోట్లు,
☛ రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులు-₹13,546Cr,
☛ వీబీ జీ రామ్ జీ -₹8,365Cr, ☛ పోలవరం ₹6,105Cr
☛ తల్లికి వందనం ₹9,668Cr, ☛ మహిళా శిశు సంక్షేమం ₹4,581Cr
☛ గృహ నిర్మాణం-₹5,451Cr, ☛ ఎన్టీఆర్ వైద్య సేవ ₹4,000Cr
☛ జల్ జీవన్ ₹4,000Cr, ☛ స్వచ్ఛ్ భారత్ మిషన్ ₹1,037Cr, ☛ విశాఖ ఆర్థిక ప్రాంతానికి ₹28,000Cr , రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు ₹30,000Cr

News February 14, 2026

MGU: డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు ‘చివరి ఛాన్స్’

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 2011-12 నుంచి 2018-19 బ్యాచ్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు సి.ఓ.ఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి చివరి అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు తమ పెండింగ్ సబ్జెక్టుల పరీక్ష ఫీజును మార్చి 4 వరకు చెల్లించవచ్చు. రూ. 100 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు గడువు ఉంది. ఇది వన్ టైమ్ ఛాన్స్ మాత్రమేనని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

News February 14, 2026

రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

image

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.