News March 23, 2025
సిద్దిపేట: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: సీపీ

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట రూరల్ సర్కిల్, దుబ్బాక సర్కిల్ పోలీస్ అధికారులతో పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు.
Similar News
News October 21, 2025
జనగామ: టెండర్ల గడువు పొడిగింపు: ఎక్సైజ్ అధికారి

ఈనెల 23 వరకు మద్యం టెండర్ల గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిని అనిత తెలిపారు. టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వడ్లకొండ రోడ్డులోని ఎక్సైజ్ కార్యాలయంలో పేర్కొన్న తేదీ వరకు టెండర్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
News October 21, 2025
ఆయన భారత్ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

AP: వైజాగ్లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
News October 21, 2025
సికింద్రాబాద్: ఆ ట్రైన్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గోరఖ్పుర్ ట్రైన్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరం నుంచి గోరఖ్పుర్కు వీక్లీ ట్రైన్ ప్రయాణికులకు సేవలందించేది. అయితే నవంబర్ 28 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ రైలు (07075- 07076)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.