News February 9, 2025

సిద్దిపేట: నేడు కొమురవెల్లి మల్లన్న 4వ ఆదివారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పట్నం, లష్కర్ వారాలతో పాటు 3వ ఆదివారం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నం వారానికి సుమారు 50 వేలకు పైగా భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News October 16, 2025

విశాఖ: దీపావళి వేళ భద్రత కట్టుదిట్టం

image

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో రైళ్లలో క్రాకర్లు తీసుకెళ్లకుండా నిరోధించడానికి వాల్తేర్ డివిజన్ అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణానికి డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కఠినమైన నిఘా ఉంచుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను భద్రతా సిబ్బందికి తెలపాలని కోరారు.

News October 16, 2025

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: ఖరీఫ్ సీజన్‌లో 8,342 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అలాగే సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 16, 2025

‘45 కేసుల్లో నిందితుడు.. రోడ్డు ప్రమాదంలో దొరికిపోయాడు’

image

పలు రాష్ట్రాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజుల క్రితం విడపనకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులలో ఒకరు అంతరాష్ట్ర నేరస్థుడు నాగిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. కారులో రూ.3.50 లక్షల నగదు, వెండి ఆభరణాలు లభ్యం కావడంతో అనుమానంతో విచారణ చేపట్టారు. నాలుగు రాష్ట్రాల్లో 45 కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడన్నారు.