News June 27, 2024

సిద్దిపేట: నేడు దరఖాస్తులకు చివరి తేదీ

image

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అటవీ శాస్త్రానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 27 చివరి తేదీ అని కళాశాల పరిశోధన కేంద్రం డీన్ తెలిపారు. ర్యాంకుల ఆధారంగా 50, పేమెంట్ ఆధారంగా 10, ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 5మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. www.fcrihyd.in వెబ్సైటును సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు 9666460939 నంబరుకు సంప్రదించాలన్నారు.

Similar News

News February 17, 2025

మెదక్: కలుసుకున్న 1972 ఇంటర్ మొదటి బ్యాచ్

image

మెదక్ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి బ్యాచ్(1972) చదువుకున్న వారంతా ఆదివారం కలుసుకున్నారు. ఇందులో కొందరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సరోజిని దేవి విద్యాసంస్థల ఛైర్మన్ ఆర్. జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ TSPCDL డైరెక్టర్ తౌట శ్రీనివాస్, వివి సిల్క్స్ వనపర్తి వెంకటేశం, అల్లెంకి సుదర్శనం, వెంకటేశం, మేడిశెట్టి కుమార్, STO జగన్నాథం, డా. రామరాజు, క్రిష్ణయ్య తదితరులున్నారు. వారంత ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

News February 17, 2025

ఇంటింటి సర్వేలో పాల్గొనని వారికి అవకాశం 

image

సమగ్ర ఇంటింటి సర్వేలో నమోదు చేసుకోనివారు ప్రజాపాలన కేంద్రాల్లో సమాచారం అందజేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 17, 2025

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో

image

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నూతన ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 64 మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారని, దీంతో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరనుందని తెలిపారు. నూతన ఉపాధ్యాయుల విధులలో చేరిన రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు.

error: Content is protected !!