News March 27, 2025
సిద్దిపేట: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం ఉంటుందన్నారు.
Similar News
News December 3, 2025
వరంగల్: ట్విస్ట్.. ఆశాలపల్లిలో ఏకగ్రీవం లేనట్లే..!

జిల్లాలోని సంగెం(M) ఆశాలవల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం దిశ నుంచి పోటీ మూడ్కు మారింది. SC మహిళ మల్లమ్మ సర్పంచ్ అవుతారనే ఊహాగానాలకు చెక్ పడింది. గ్రామ యువకుడు కార్తీక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్కలపల్లి యువతి నవ్యశ్రీకి BRS-BJPలు బ్యాకింగ్ ఇవ్వడంతో బరిలోకి దిగింది. ప్రేమలో గెలిచిన నవ్యశ్రీ సర్పంచ్గానూ గెలుస్తుందా? లేక అధికార పార్టీ వర్గాల మద్దతున్న మల్లమ్మ విజయం సాధిస్తారా? తెలియాల్సి ఉంది.
News December 3, 2025
మెదక్: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు
News December 3, 2025
సిద్దిపేట: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం

సిద్దిపేట జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అక్కన్నపేట, చేర్యాల, దుల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరు మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు.


