News March 27, 2025

సిద్దిపేట: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

image

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం ఉంటుందన్నారు.

Similar News

News December 18, 2025

తిరుపతి: హోటళ్లకు రాయితీలు.. కట్టడాలకు గ్రహణం.!

image

తిరుపతి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రముఖులు బస చేసేందుకు 3-7స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చకచక అడుగులు వేస్తోంది. రాయితీలు, ల్యాండ్ లీజు తక్కువ ధరకు పాలసీలను తీసుకొస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రముఖ కట్టడాలను గాలికి వదిలేసింది. మూలకోన, తలకోన, చంద్రగిరి, కార్వేటినగరం కోట ఇలా అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. వీటిపై దృష్టి సారించాల్సి ఉంది

News December 18, 2025

అల్లూరి: 800 ఎకరాలలో పట్టుపురుగుల సాగు

image

పాడేరులోని అల్లూరి జిల్లా పట్టు పరిశ్రమ ప్రధాన కార్యాలయంలో స్కిల్ సమగ్ర-2 పథకంపై గురువారం పట్టు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌ఛార్జ్ JC తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా పట్టు ఉత్పత్తిలో రైతులకు అవగాహన కల్పిస్తూ, 400మంది రైతులతో, 800ఎకరాలలో పట్టుపురుగుల సాగు చేస్తున్నామన్నారు. సంవత్సరంలో పది పంటలు తీసుకొని ప్రతి నెలా ఆదాయం పొందేలా చూస్తున్నామన్నారు.

News December 18, 2025

AILET ఫలితాలు విడుదల

image

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్(AILET) ఫలితాలు విడుదలయ్యాయి. https://nationallawuniversitydelhi.in/లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రఖ్యాత నేషనల్ లా యూనివర్సిటీలో ఐదేళ్ల B.A.LL.B.(Hons.), ఏడాది LL.M. కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 14న ఈ పరీక్ష జరిగింది. దాదాపు 26వేల మంది హాజరయ్యారు. ఈ వర్సిటీలో క్లాట్, ఎల్ శాట్ స్కోర్లతో అడ్మిషన్ లభించదు.