News March 1, 2025

సిద్దిపేట: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు:కలెక్టర్

image

ఈనెల 5 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. జిల్లాలో 43 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈనెల 21 నుంచి జరిగే టెన్త్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 27, 2025

ASF: ‘సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా చేపట్టాలి’

image

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. 

News March 27, 2025

ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

image

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

News March 27, 2025

ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్‌కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.

error: Content is protected !!