News January 29, 2025

సిద్దిపేట: ‘పదిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి’

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపళ్లతో సమీక్షా నిర్వహించారు. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు సిద్ధం చేయాలన ఆదేశించారు.

Similar News

News November 24, 2025

ధర్మేంద్ర చివరి సినిమా ఇదే

image

బాలీవుడ్‌ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం చేశారు. 1960-80 మధ్య స్టార్‌డమ్‌ సంపాదించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. షోలే, పూల్ ఔర్‌ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించారు. చివరిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాలో సినిమాలో కనిపించారు. ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.

News November 24, 2025

చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

News November 24, 2025

పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.