News February 14, 2025
సిద్దిపేట: పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఘటనకు 11 ఏళ్లు

పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం పొన్నం HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News November 26, 2025
పల్నాడు: హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం ఇలా..!

పెదకూరపాడు నియోజకవర్గంలోని హెడ్ కానిస్టేబుల్ చైన్ లింక్ ద్వారా తోటి పోలీసులు, సామాన్య ప్రజలతో డబ్బులు కట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత డాలర్లు కొనుగోలు చేస్తే తిరిగి వస్తాయి అంటూ కట్టించాడని, తమ వద్ద కమీషన్ పేరుతో డబ్బులు కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. చివరకు అతను చెప్పిన విధంగా డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.
News November 26, 2025
జన్నారం: గంటలో స్పందించిన అధికారులు

జన్నారం బస్టాండ్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయని, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం సాయంత్రం 4 గంటలకు WAY2NEWSలో వార్త పబ్లిష్ అయింది. అధికారులు గంటలో స్పందించి బస్టాండ్లోని ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తీసేయించారు.
News November 26, 2025
HNK: ప్రయాణికుల సలహాల కోసం ‘డయల్ యువర్ డీఎం’

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు వారి సూచనల కోసం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని ప్రజలు ఈ నెల 27, గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 8977781103 నెంబరుకు ఫోన్ చేసి, డిపో అభివృద్ధికి విలువైన సలహాలను అందించాలని ఆయన కోరారు.


