News February 14, 2025

సిద్దిపేట: పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఘటనకు 11 ఏళ్లు

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 ఫిబ్రవరి 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం పొన్నం HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News February 24, 2026

సిద్దిపేట: టెన్త్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిఘా ఉంచాలన్నారు.

News February 24, 2026

సంగారెడ్డి: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే చర్యలు!

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 17,762 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,224 మంది కలిపి మొత్తం 35,986 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని సూచించారు.

News February 24, 2026

పుట్టపర్తి సివిల్ జడ్జి కోర్టుకు బాంబు బెదిరింపు

image

పుట్టపర్తిలోని సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మంగళవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. కోర్టులో బాంబు ఉందని మెయిల్ రావడంతో డీఎస్పీ విజయ్ కుమార్ రంగంలోకి దిగి మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని, నకిలీ మెయిల్ ఐడీలతో కొందరు వ్యవస్థలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు.