News January 30, 2025

సిద్దిపేట: పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు: సీపీ

image

పోక్సో కేసులో నేరస్థుడికి 20ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సాయి రమాదేవి తీర్పును ఇచ్చారని సీపీ బి. అనురాధ తెలిపారు. త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని పొన్నాలలో ఓ ఇంట్లో యూపీలోని గోరఖ్‌పూర్ తాలుకా రసూలాపూర్‌కు చెందిన అజయ్(30) 2024 ఆగస్టు 19న బాలికపై అత్యాచారం కేసులో తీర్పును వెలువరించినట్లు తెలిపారు. నిందితులు తప్పించుకోలేరని, 5 నెలల్లోనే కేసు పూర్తయిందన్నారు.

Similar News

News November 28, 2025

MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

News November 28, 2025

నాన్-ఏసీ కోచ్‌ల్లోనూ దుప్పటి, దిండు

image

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్‌లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

News November 28, 2025

సిద్దిపేట: గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.