News March 11, 2025

సిద్దిపేట: పోలీసులకు ఫిర్యాదు చేసిందని చంపేశాడు !

image

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో మహిళను చంపేశాడు. HYDకి చెందిన అస్రాబేగం(45), సాదతుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇండోర్‌కు చెందిన అస్లాంను రెండోపెళ్లి చేసుకోగా ఇద్దరి మధ్య మనస్పర్ధలతో DECలో తిరిగొచ్చి పిల్లలతో ఉంటుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అస్లాం HYDకి వచ్చాడు. ఇద్దరు కలిసి <<15709214>>గజ్వేల్‌<<>>లోని రిమ్మనగూడెం వద్ద బంకులో పనిచేస్తున్న సాదుతుల్లా వద్దకు వచ్చారు. అస్లాం పారతో కొట్టి చంపాడు.

Similar News

News March 20, 2025

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

image

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

News March 20, 2025

కాంగ్రెస్‌తోనే సాధ్యమైన ఎస్సీ వర్గీకరణ: మంత్రి

image

మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంత్రిని ఆందోలు నియోజకవర్గ దళిత కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో గురువారం కలిసి సన్మానించారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు గణపతి, సుధాకర్, నగేష్, కృష్ణ, లక్ష్మణ్, పాల్గొన్నారు.

News March 20, 2025

VKB: పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా.. ఇతర అసౌకర్యాలు కలిగినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని.. కేంద్రాల్లోకి సెల్ఫోన్లో అనుమతి లేదన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

error: Content is protected !!