News April 9, 2025

సిద్దిపేట: పోషన్ అభియాన్ జయప్రదం చేయాలి

image

పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఎసిఎల్బి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 2, 2025

చెన్నేకొత్తపల్లి: హైవేపై ప్రమాదం.. ఒకరి మృతి

image

చెన్నేకొత్తపల్లి మండలం కేంద్రం సమీపాన కోణ క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రావుల సోమశేఖర్ అనే యువకుడు బైకుపై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీకేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.

News November 2, 2025

HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

image

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News November 2, 2025

మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డాన్స్ చేస్తారు: రాహుల్

image

ఓట్ల కోసం ప్రధాని మోదీ డ్రామా ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత హామీలను నెరవేర్చరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఓట్ల కోసం PM యోగా చేయమన్నా చేస్తారు. కొన్ని ఆసనాలు వేస్తారు. కానీ ఎన్నికలయ్యాక సింగింగ్, డాన్సింగ్ అంతా అదానీ, అంబానీ చేస్తారు. ఇదంతా ఓ నాటకం’ అని ఆరోపించారు. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలు ఆయన్ను నియంత్రిస్తున్నారని బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.