News January 27, 2025
సిద్దిపేట: ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ప్రత్యేకాధికారిగా సిద్దిపేట ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈ మేరకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్, చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీల కమిషనర్ల సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఆయనను శాలువాతో సన్మానించారు.
Similar News
News February 16, 2025
ఏప్రిల్లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.
News February 16, 2025
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు హీరో ప్రభాస్కు ఆహ్వానం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. ఆదివారం ప్రభాస్ను కలిసిన ఎమ్మెల్యే.. ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా ఇప్పటికే ప్రభాస్ మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను ఆధారంగా తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.