News February 3, 2025
సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO

ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.
Similar News
News November 22, 2025
చార్మినార్ సాక్షిగా పోలీసుల సంకల్పం!

జాగృత్ హైదరాబాద్–సురక్షిత హైదరాబాద్ అనే నినాదంతో సైబర్క్రైమ్ మీద సిటీ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నగర సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన చారిత్రక వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం ఖుషీగా ఉందని CP సజ్జనార్ ట్వీట్ చేశారు. మన చారిత్రక నగరాన్ని డిజిటల్ సేఫ్, ఫ్యూచర్లోనూ సేఫ్గా ఉంచడానికి అందరం కలిసి పనిచేద్దాం’ అని సజ్జనార్ పిలుపునిచ్చారు.
News November 22, 2025
కారంచేడులో గ్రామసభ

కారంచేడు మండలంలోని గ్రామ పంచాయతీలలో శనివారం ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. బాపట్ల జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ A. విజయలక్ష్మి, ఎంపీడీవో K. నేతాజీ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత నెలలో శ్రామికుల ఈకేవైసీ పూర్తయిందని, మరణించిన వారి జాబ్ కార్డులు రద్దయాయని తెలిపారు. కొత్తగా జాబ్ కార్డుల మంజూరు, రద్దు అయిన కార్డుల పునరుద్ధరణకు గ్రామసభ ఏర్పాటు చేశామన్నారు.
News November 22, 2025
రేపు భారత్ బంద్కు పిలుపు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.


