News March 23, 2025

సిద్దిపేట: ఫిబ్రవరి 9న సౌదీలో మృతి.. నేడు అంత్యక్రియలు

image

సౌదీ అరేబియాకు బతుకు దేరువు నిమిత్తం కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన జాలిగం అశోక్ వెళ్లగా ఫిబ్రవరి 9న ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామం చేరడానికి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వేడుకున్నారు. సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో ఎంపీ మాట్లాడి శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

Similar News

News March 26, 2025

సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుధవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6767 మంది విద్యార్థులకు 6750 విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాలేదని తెలిపారు. 

News March 26, 2025

ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం: మంత్రి ఉత్తమ్

image

ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యంపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సన్నబియ్యం స్కీమ్‌తో 84 శాతం మంది పేదలు లబ్ధి పొందనున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

News March 26, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.

error: Content is protected !!