News June 12, 2024

సిద్దిపేట: బడుల్లో సమస్యల గంట!

image

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాల సంఖ్య 1,018కు చేరాయి. ఇందులో 814 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఇతర పనులు చేయిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.34.80 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పటివరకు రూ.8.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

Similar News

News October 2, 2024

MDK: మహిళలు మౌనం వీడి రక్షణ పొందండి: జిల్లా ఎస్పీ

image

మహిళలు, విద్యార్థినులు, బాలికలు మౌనం వీడి వేధింపులపై షీ టీంకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల జిల్లాలోని ప్రతి పాఠశాలలు, కళాశాలలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. షీ టీం వాట్సాప్ నెంబర్ 87126 57963, 63039 23823, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 57888లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News October 2, 2024

మెదక్: ప్రజలకు హరీష్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు

image

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.

News October 2, 2024

సంగారెడ్డిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు

image

సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.