News July 15, 2024
సిద్దిపేట: బావపై బామ్మర్ది దాడి.. మృతి

బామ్మర్ది దాడిలో బావ మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కుకునూరు మం. తిప్పాపురం గ్రామానికి చెందిన రాజు(35) దంపతులు భార్య ఫ్యామిలీతో కలిసి జవహర్నగర్లో ఉంటున్నారు. శనివారం రాత్రి రాజు మద్యం మత్తులో భార్య, అత్తపై చేయి చేసుకున్నాడు. దీంతో బామ్మర్ది చందు పక్కనే ఉన్న చెక్కతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజును గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.
Similar News
News December 30, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్ సాయి (21) మృతిచెందినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. హేమంత్ సాయి శనివారం రాత్రి కుక్కదువు ప్రవీణ్ (20), మధ్యప్రదేశ్కు చెందిన కుల్దీప్తో కలిసి బైక్పై మేడ్చల్ బయలుదేరారు. మార్గమధ్యంలో ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో హేమంత్ సాయి మృతిచెందగా, ఇరువురు గాయపడ్డారు.
News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.
News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.


