News July 12, 2024

సిద్దిపేట: బిహార్‌ కూలీలతో వరి నాట్లు

image

వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు వలస కూలీల మీద ఆధారపడుతున్నారు. వరినాట్లు వేసేందుకు మూడు, నాలుగేళ్ళుగా బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల నుంచి కూలీలు నాట్లు వేసేందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి బిహార్‌కు చెందిన మగ కూలీలు వందమందికి పైగా వచ్చి నాట్లు వేశారు.

Similar News

News February 14, 2025

మెదక్: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

image

నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.

News February 13, 2025

ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మహేందర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఐఆర్, ఐఆర్ఏడి సైబర్ అవేర్‌నెస్, ఈ ఛానల్ పై వారికి శిక్షణ ఇచ్చారు.

News February 13, 2025

MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

error: Content is protected !!