News February 5, 2025
సిద్దిపేట: బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఐదుగురు

BJP సిద్దిపేట జిల్లా దళపతి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో గంగాడి మోహన్ రెడ్డి, అంబటి బాలేష్ గౌడ్, గురువారెడ్డి, నల్ల శ్రీనివాస్, బైరి శంకర్ ముదిరాజ్ ఉన్నారు. బీసీలకు ఇవ్వాలని పలువురు నేతలు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్ఠానం పెండింగ్లో పెట్టింది. పార్టీ పెద్దలు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 15, 2025
పాక్కు బిగ్ షాక్: 214 సైనికుల్ని చంపేసిన BLA

పాకిస్థాన్కు చావుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ‘యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48hrs గడువిచ్చాం. వారి జవాన్లను రక్షించుకొనేందుకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితుల్ని పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం. మా 12మంది అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాం’ అని BLA ప్రకటించింది.
News March 15, 2025
VKB: నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 176 ఉన్నత,18 కేజీబివి, మోడల్ 9, యూపీఎస్లు114, ప్రాథమిక 770 పాఠశాలలు ఉండగా అందులో 1,22,556 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. అలాగే ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు.
News March 15, 2025
మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.