News January 22, 2025
సిద్దిపేట: బేటీ బచావో బేటీ పఢావో పోస్టర్ ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం నిర్వహించారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ చాంబర్లో “బేటీ బచావో బేటీ పఢావో” పోస్టర్స్ని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆవిష్కరించారు. ఈనెల 22 నుంచి మార్చి 8, 2025 మహిళా దినోత్సవం నాటి వరకు ఆడపిల్లల ప్రాముఖ్యతను కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
Similar News
News October 13, 2025
అనంతగిరి: కందిరీగల దాడిలో మహిళ మృతి

కందిరీగలు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. కుటుంబీకుల వివరాల మేరకు..అనంతగిరి(M) కరయిగూడ గ్రామానికీ చెందిన శాంతి (20) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపం కొండవద్ద పశువులను కాసేందుకు వెళ్లింది. ఒక్కసారిగా గుంపులగా కందిరీగలు ఆమె దాడి చేశాయి. స్థానికులు హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకు ఏరియా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు నేడు మృతి చెందింది.
News October 13, 2025
ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: DSP

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉందని ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసు అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
News October 13, 2025
జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా బాధ్యతల స్వీకరణ

విజయనగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా వి.వెంకట సుబ్బారావు తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రూ, మహాకవి గురజాడ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయ సిబ్బంది వెంకట సుబ్బారావుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.