News March 19, 2025

సిద్దిపేట: భట్టి బడ్జెట్‌పై బోలేడు ఆశలు..!

image

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలేడు ఆశలు పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం, భూనిర్వాసితులకు పరిహారం నిధుల కేటాయింపుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. చేర్యాల, దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, జిల్లాలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

Similar News

News January 11, 2026

కామారెడ్డి: ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మూడు రోజులుగా జరిగిన కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారుల శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ప్రత్యేక అధికారులకు పలు అంశాలపై మూడు రోజుల పాటు అవగాహన కల్పించారు. చివరి రోజు ప్రత్యేక అధికారులు పలు రకాల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

News January 11, 2026

NZB: ‘నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు’

image

CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు.

News January 11, 2026

తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

image

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.