News May 19, 2024
సిద్దిపేట: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం
మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన లారీ డ్రైవర్ శనివారం సరుకులు దింపి తిరిగి వెళుతున్న క్రమంలో సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పింది. చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంకు వద్ద ఫౌంటేన్లోకి లారీని ఎక్కించాడు. పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
Similar News
News October 4, 2024
MDK: మొదలైన సందడి.. నామినేటెడ్ ఆశలు?
మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News October 4, 2024
మెదక్: పెరిగిన ధరలు సామాన్యుల ఇక్కట్లు
ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూరగాయల రేట్లు కొండెకాయి. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగే గ్రామీణ ప్రాంత సంతలో టమాటా కిలో రూ.50 – 80, బీరకాయలు 60 -70, బెండకాయలు 50 – 80, పచ్చి మిర్చి 80 – 100 వరకు ఉంది.
News October 3, 2024
KCR.. వాళ్లని కంట్రోల్ చేయ్: MP
HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.