News January 24, 2025
సిద్దిపేట: మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం బాధాకరం: హరీష్ రావు

జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని, ములుగు జిల్లా బట్టాయిగూడెంలో నాగయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు ‘X’లో ఆవేదన వ్యక్తపరిచారు. తన చావుతోనైనా అర్హులకు పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ ఆస్పత్రి పాలైన రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు
Similar News
News November 28, 2025
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్
News November 28, 2025
వనపర్తి: బకాయి చెల్లిస్తేనే కొత్త ధాన్యం: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలో డిఫాల్టర్ల జాబితాలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) తో పాటు, పెనాల్టీ కూడా చెల్లిస్తేనే కొత్తగా ధాన్యం పొందవచ్చని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ సూచించారు. రైస్ మిల్లర్లతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నూరు శాతం సీఎంఆర్తో పాటు, 12% లేదా 25% పెనాల్టీ చెల్లిస్తేనే కొత్త ధాన్యం పొందడానికి అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు.
News November 28, 2025
మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.


