News January 24, 2025

సిద్దిపేట: మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం బాధాకరం: హరీష్ రావు

image

జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని, ములుగు జిల్లా బట్టాయిగూడెంలో నాగయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు ‘X’లో ఆవేదన వ్యక్తపరిచారు. తన చావుతోనైనా అర్హులకు పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ ఆస్పత్రి పాలైన రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు

Similar News

News November 14, 2025

8 రోజులు క్రిస్మస్ సెలవులు!

image

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.

News November 14, 2025

HYD: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తాం: DGP

image

ఎల్బీ స్టేడియంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు తలపెట్టిన Arrive Alive కార్యక్రమాన్ని DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్‌ను సినీ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News November 14, 2025

విశాఖ: 400 MOUలు.. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులు

image

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐఅండ్‌ఐ, పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.