News March 19, 2025
సిద్దిపేట: ముగ్గురు ఎంపీడీవోలకు పదోన్నతి

సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తున్న ఏ. ప్రవీణ్, జయరాం, ఏపీడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్లకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు వెలువరించారు.
Similar News
News January 10, 2026
పుతిన్నూ అదుపులోకి తీసుకుంటారా?.. ట్రంప్ సమాధానమిదే!

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను <<18751661>>అదుపులోకి<<>> తీసుకుని అమెరికా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్ను కూడా పట్టుకోవాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అని బదులిచ్చారు. పుతిన్తో తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పారు. కానీ ఆయన విషయంలో నిరాశకు గురయ్యానని అన్నారు.
News January 10, 2026
పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో 17న తుక్కు వేలం

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.
News January 10, 2026
48 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పోస్టల్ డిపార్ట్మెంట్లో 48 కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అహ్మదాబాద్ ప్రాంతంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 27ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్ల్ సడలింపు ఉంది. నెలకు జీతం రూ.19,900-63,200 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.indiapost.gov.in/


