News August 21, 2024
సిద్దిపేట: మూడేళ్ల పాపపై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

మూడేళ్ల పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలు.. మైత్రివనంలో నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్లో నేపాల్కు చెందిన వ్యక్తి వాచ్మెన్గా పని చేస్తూ భార్య, మనవరాలితో నివాసం ఉంటున్నాడు. 19న పెయింటింగ్ పని చేస్తున్న UPకి చెందిన అజయ్(30) పాపను ఆడిస్తానని అత్యాచారం చేసినట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
News December 9, 2025
MDK: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి

మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు యువత రంగంలోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టన్నీ, బాధ్యతను గుర్తించిన యువత ఈసారి జరగనున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించునున్నారు. గ్రామ అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే గొప్ప తత్వాన్ని అలవర్చుకొని, ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు, మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో, లేదో!
News December 9, 2025
మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.


