News April 6, 2025
సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News April 17, 2025
రేపు తిరుపతికి పవన్ కళ్యాణ్ రాక.?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం తిరుపతికి రానున్నట్లు సమాచారం. టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. గోవులను పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు.
News April 17, 2025
భూపాలపల్లిలో సైబర్ నేరాలపై ఎస్పీ హెచ్చరిక

భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ ఏజెన్సీల పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించే ఆశ చూపి మోసం చేస్తున్నారని తెలిపారు. OTP ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 17, 2025
YCP హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు: కూటమి నేతలు

AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.