News April 6, 2025

సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

image

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News November 15, 2025

బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.

News November 15, 2025

కామారెడ్డి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును పొడిగించినట్లు కామారెడ్డి DEO రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ప‌రీక్షా ఫీజు చెల్లించవచ్చ‌ని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. రూ.200 లేట్‌ ఫీజుతో DEC 2 నుంచి 11 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో DEC 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

News November 15, 2025

జగిత్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడి భార్యను హత్య చేసిన భర్తకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి నారాయణ జీవిత ఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా విధించారు. మెట్‌పల్లికి చెందిన వాల్గోట్ కిశోర్(32) భార్య నిషిత(28)ను 28-12-2021న ఇంట్లో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం శిక్షను అమలు చేశారు.