News April 6, 2025

సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

image

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News November 18, 2025

HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్‌ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెన్జా వంటి వైరస్‌లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

News November 18, 2025

HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్‌ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెన్జా వంటి వైరస్‌లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

News November 18, 2025

రూమ్ బుకింగ్ పేరుతో రూ. 18 లక్షలు దోచేశారు..!

image

రూమ్స్ బుక్ చేస్తే పెట్టుబడికి డబుల్ ఆదాయం వస్తుందని రాజమండ్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫణికుమార్ ఇన్‌స్టాగ్రామ్‌‌కు ఓ లింక్ వచ్చింది. లింక్‌ను ఓపెన్ చేసి తొలుత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి డబుల్ లాభం పొందాడు. దీంతో నమ్మకం కలిగి, రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.