News March 17, 2025
సిద్దిపేట: రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై సమీక్ష

ప్రజా భవన్లో ఆదివారం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులతో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్ నగర శివారులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.
News October 26, 2025
పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య.. చర్ల సరిహద్దులో ఘటన

తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కాంకేర్ గ్రామానికి చెందిన కట్టాం రవి, సోడి తిరుపతిలను పదునైన ఆయుధాలతో హత్య చేశారు. ఇన్ఫార్మర్లనే కారణమంటూ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
కంట్రోల్ రూమ్ను తనిఖీ చేసిన కలెక్టర్

కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన అధికారులతో తుఫాను సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. తుఫాను సందర్భంగా ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.


