News February 24, 2025

సిద్దిపేట: రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

చిన్నకోడూర్ మండలం మల్లారంలో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 24, 2025

CM రిలీఫ్ ఫండ్ కోసం కావాల్సినవి!

image

ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏయే సర్టిఫికెట్లు కావాలో చాలా మందికి తెలియదు. దీనికోసం ఫైనల్ బిల్స్, ఎసెన్షియల్ సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇన్ పేషెంట్ బిల్, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్, ఆధార్ కార్డు& బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ & రేషన్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు కావాలి. వీటిని స్థానిక MLAకు అందించాలి. SHARE IT

News February 24, 2025

వారికి క్షమాపణలు చెప్పిన ‘ఛావా’ డైరెక్టర్

image

‘ఛావా’ సినిమాలో తమ పూర్వీకులు గనోజీ, కన్హాజీ షిర్కేను అవమానించారనే వారసుల ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్ స్పందించారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు. అంతకుముందు సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామని షిర్కే వారసులు దర్శకుడిని హెచ్చరించారు. మరోవైపు ఛావా థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

News February 24, 2025

ఖజానా ఖాళీ..! డబ్బులు ఇల్లె..!!

image

దేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయిన వారంతా చెబుతున్న మాటలివి. పథకాలు అమలు చేద్దామన్నా, ఆర్థికపర నిర్ణయాలు తీసుకుందామన్నా ఖజానా ఖాళీ అయింది అని మొన్న తెలంగాణ సీఎం రేవంత్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఢిల్లీ సీఎం రేఖ అంటున్నారు. ఇందుకు చెప్పే కామన్ కారణం గత పాలకుల నిర్ణయాలు. రేపటి పాలకులు ఈ మాట చెప్పొద్దంటే కనీస అవసరాలు కాని ఉచితాలు ఆపేయడమే పరిష్కార మార్గం. నేతలు ఈ నిర్ణయం తీసుకోగలరా?

error: Content is protected !!