News February 26, 2025
సిద్దిపేట: ‘రాబోయేది నానో తరం’

రాబోయేది నానో తరమని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక పేర్కొన్నారు. మంగళవారం నానో యూరియా, డీఏపీ వినియోగంపై ఫర్టిలైజర్ డీలర్లు, ఎఫ్పీసీ సంఘం సభ్యులకు సిద్దిపేటలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా, డీఏపీ స్థానంలో ఇఫ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ వినియోగం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు.
Similar News
News November 2, 2025
ఏలూరులో ఈనెల 5న జాబ్ మేళా

ఏలూరు అశోక్ నగర్ కేపీడీటీ హైస్కూల్ ఆవరణలో ఈనెల 5 బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు శనివారం తెలిపారు. 17 కంపెనీలలోని సుమారు 1,205 ఉద్యోగ ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, (డీబీఏమ్) ఫార్మసీ, MBBS, పీజీ, బీటెక్ విద్యార్హతలు గల 18-35 ఏళ్ల వయస్సు వారు ఈ మేళాకు హాజరు కావాలన్నారు.
News November 2, 2025
BIG BREAKING: వికారాబాద్ జిల్లాలో ముగ్గురి MURDER, ఒకరిపై హత్యాయత్నం

ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి తాను సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య అతడి భార్య, కుమార్తె, వదినను కత్తితో పొడిచి చంపి, మరో కుమార్తెను చంపేందుకు యత్నించాడు. అనంతరం తాను సూసైడ్ చేసుకున్నాడు. పరిగి DSP శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.


