News February 26, 2025
సిద్దిపేట: ‘రాబోయేది నానో తరం’

రాబోయేది నానో తరమని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక పేర్కొన్నారు. మంగళవారం నానో యూరియా, డీఏపీ వినియోగంపై ఫర్టిలైజర్ డీలర్లు, ఎఫ్పీసీ సంఘం సభ్యులకు సిద్దిపేటలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా, డీఏపీ స్థానంలో ఇఫ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ వినియోగం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు.
Similar News
News November 18, 2025
వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.
News November 18, 2025
వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.


