News February 26, 2025
సిద్దిపేట: ‘రాబోయేది నానో తరం’

రాబోయేది నానో తరమని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక పేర్కొన్నారు. మంగళవారం నానో యూరియా, డీఏపీ వినియోగంపై ఫర్టిలైజర్ డీలర్లు, ఎఫ్పీసీ సంఘం సభ్యులకు సిద్దిపేటలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా, డీఏపీ స్థానంలో ఇఫ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ వినియోగం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు.
Similar News
News November 16, 2025
నెల్లూరు: బలవంతంగా పసుపుతాడు కట్టి బాలికపై ఆత్యాచారం

గుంటూరు రూరల్కు చెందిన బాలికపై అత్యాచారం కేసులో నెల్లూరుకు చెందిన నిందితుడు బన్నీ, సహకరించిన అతడి అమ్మ, అమ్మమ్మను గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. గుంటూరు రూరల్లో పదో తరగతి చదివే బాలికను బన్నీ నెల్లూరుకు తీసుకెళ్లి బలవంతంగా పసుపుతాడు కట్టి, అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. పోక్సో చట్టం ప్రకారం సహకరించిన వారికి కూడా సమాన శిక్ష వర్తిస్తుందని పోలీసులు తెలిపారు.
News November 16, 2025
MHBD: వ్యభిచార ముఠా గుట్టు రట్టు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక రోడ్డులోని ఓ కాలనీలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పట్టణ పోలీసులు దాడులు చేశారు. టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. టౌన్ ఎస్సై సూరయ్య ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News November 16, 2025
పెద్దపల్లి: నాణ్యమైన ధాన్యం కోరే రైతులకు కొత్త ఎంపిక

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన కె.ఎన్.యం-118 కొత్త రకం వరి వంగడాలు, యంటియు-1010కు మెరుగైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బత్తిని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎత్తు తక్కువ, బలమైన కాండం, నేలవాలని గుణం, సుదిదోమను (కొంతమేర) తట్టుకునే లక్షణాలు, 125 రోజుల్లో కోతకు సిద్ధమవ్వడం, ఎకరాకు 2.8-3.2 టన్నుల ఉత్తమ దిగుబడితో నాణ్యమైన ధాన్యాన్ని ఇవ్వడం దీని ప్రత్యేకత.


