News March 13, 2025

సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరీ జిల్లా ప్రజలకు తెలిపారు. బుదవారం బుధవారం జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్, ఎంపీఓ, ఎంపీడీఓ, ఎంపీడీవో, ఔట్ యజమానులతో అందరితో నిర్వహించిన ఎల్ఆర్ఎస్-2020 పైన అవగాహన కల్పించారు.

Similar News

News November 26, 2025

జగిత్యాల: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్ (లోకల్ బాడీస్) తదితరులు పాల్గొన్నారు.

News November 26, 2025

రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

image

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్‌కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News November 26, 2025

జగిత్యాల: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలి: ఎస్పీ

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.