News February 14, 2026

సిద్దిపేట: రాష్ట్ర స్థాయికి అపూర్వ ఎంపిక

image

సిద్దిపేట జిల్లా స్థాయి CM CUP వాలీబాల్ పోటీల్లో రాంసాగర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థిని CH. అపూర్వ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ నెల 21 నుండి 23 వరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరగనున్న పోటీల్లో ఆమె జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. అపూర్వను పాఠశాల హెచ్‌ఎం జి. రాజ్‌కుమార్, పీఈటీ ఎండీ. అనీఫ్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Similar News

News March 13, 2026

WGL: నేటి నుంచి అన్నీ ఆన్ లైన్‌లోనే!

image

RTAలో అవినీతిని అరికట్టేందుకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి RTAలో పేపర్ లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫామ్ 20, ఇతర పత్రాలన్నీ స్కాన్ కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే డీలర్లు అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. నకిలీ పత్రాలను సమర్పిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

News March 13, 2026

పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

image

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్‌కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్‌ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.

News March 13, 2026

రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

image

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.