News April 4, 2025

సిద్దిపేట: రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో గల వరిధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. శుక్రవారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఐకేపీ సెంటర్‌లలోనే వరిధాన్యం కోనుగోలుకు అవసరమైన పాడి క్లీనర్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News November 21, 2025

విశాఖ: ప్రేమ.. పెళ్లి.. ఓ తమిళబ్బాయ్..!

image

విశాఖలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకుల ఘర్షణ పడగా ఒకరికి గాయాలయ్యాయి. ఓ హోటల్లో పనిచేస్తున్న అమ్మాయి మొదట ఒక తెలుగు యువకుడ్ని ప్రేమించింది. తర్వాత మరో తమిళ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రెఢీ అయ్యింది. దీంతో ఆ ఇద్దరి యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెలుగు యువకుడు, తమిళ యువకుడుపై కత్తితో దాడి చేసినట్లు అమ్మాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News November 21, 2025

‘హిడ్మాను, మరికొందరిని పట్టుకొని ఎన్కౌంటర్ కథ అల్లారు’

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో ఈనెల 15న నిరాయుధంగా ఉన్న సమయంలో పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు . AOB రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌ను చంపారని అందులో పేర్కొన్నారు.

News November 21, 2025

DoPTకి లేఖ రాసిన ACB

image

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్‌ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.