News February 8, 2025

సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

Similar News

News November 7, 2025

రాజన్న ఆలయం పడమరవైపు గేటు మూసివేత

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం పడమరవైపు గేటును మూసివేశారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో రాజన్న ఆలయంలో సాధారణ దర్శనాలు కొనసాగిస్తున్న అధికారులు అన్నిరకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయానికి మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పడమరవైపు స్వాగత ద్వారానికి అడ్డంగా రేకులను అమర్చారు. పీఆర్‌ఓ కార్యాలయ మార్గం నుంచి ఆలయంలోపలికి వెళ్లకుండా అక్కడ కూడా రేకులను అడ్డుగాపెట్టి రాకపోకలను నిలిపివేశారు.

News November 7, 2025

PRG: సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి.. ఒకరి మృతి

image

పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నారీ జిల్లాకు చెందిన కార్మికుడు మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI మోహనకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 7, 2025

నేడు పేర్కంకంపల్లికి ఎమ్మెల్సీ కవిత

image

యాలాల: చేవెళ్ల బస్సు ప్రమాదంలో పెర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియా, తనుష, నందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు MLC కవిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.