News February 8, 2025
సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
Similar News
News January 3, 2026
వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు

ఖరీఫ్ వరి కోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో జీరోటిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడును జనవరి 2వ వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం వరకు విత్తుకోవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఈ విధానంలో సంకర రకాలతోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. తిలన్ టెక్-ఎస్.యు.యెన్.హెచ్-1, N.D.S.H.-1012, కె.బి.ఎస్.హెచ్-44, డి.ఆర్.ఎస్.హెచ్-1 ఇతర ప్రైవేటు సంస్థల హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం సరిపోతుంది.
News January 3, 2026
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం బయటకు వస్తూ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు సెల్యూట్ చేశారు. పవన్ అభిమానులతో కొండగట్టు కిక్కిరిసిపోయింది.
News January 3, 2026
వరంగల్ తూర్పులో పోస్టింగులు ఊస్టింగులే..!

WGL తూర్పు ని.వ.లో పోలీసుల నౌకరి అరిటాకు కథలా మారింది. మంత్రి మాటవింటే అధికారులు వేటు వేయడం, వినకుంటే పోస్టింగ్ లెటర్లు మరొకరికి ఇవ్వడం రివాజుగా మారింది. మంత్రి, మాజీ MLC, PA, OSD, కుటుంబీకులు, అనుచరులు ఎవరి మాట వినకున్నా వారి పోస్టింగ్లు ఊస్టింగులే అక్కడ. ఇలాంటి పరిస్థితిలో సాహసం చేసి డ్యూటీ చేస్తే చివరకు వారికి ఆపద(సస్పెన్షన్లు) వస్తే ఆ కుటుంబం చేతులెత్తేయడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.


