News March 21, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..

కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం.. గజ్వేల్ మండలం దిలాల్పూర్కు చెందిన క్యాసారం బాబు సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ మధ్యలో స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
ఖమ్మం: ఓటు వేయాలంటే.. గుర్తింపు కార్డులే ఆధారం!

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ రేపు జరగనుంది. ఉద్యోగులు పంపిణీ చేసే ఓటరు స్లిప్ను కేవలం సమాచారం కోసమే వినియోగించాలని, అది గుర్తింపు పత్రంగా చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేయడానికి ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్ సహా 18 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని అధికారులు ఓటర్లకు సూచించారు.
News December 10, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in


