News January 29, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదం UPDATE.. ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15299553>>సిద్దిపేట<<>>కు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు ఆకుల కనకయ్య వియ్యంకుడు జంగిటి జనార్ధన్(55) చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కనకయ్య పెద్ద కొడుకుకి లివర్ నుంచి బ్లడ్ రావడంతో ప్రస్తుతం సర్జరీ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News December 18, 2025
భూపాలపల్లి: ఇలా జరిగిందేమిటి? ఎంత ఖర్చు చేసినా దక్కని విజయం!

జిల్లాలో 3 విడతలుగా 248 పంచాయతీలు, 2,102 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ముందు నుంచి విజయ అవకాశాలు ఉండటం, ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా ఓటు అభ్యర్థించి ఎంతో కొంత ముట్టజెప్పిన ఓటర్లు మాత్రం భిన్నంగా తీర్పు ఇవ్వడంతో ఆవేదనలో ఉన్నారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా విజయం దక్కలేదని ఓటమి చెందిన అభ్యర్థుల ఆవేదన చెందుతున్నారు.
News December 18, 2025
తిరుపతి: హోటళ్లకు రాయితీలు.. కట్టడాలకు గ్రహణం.!

తిరుపతి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రముఖులు బస చేసేందుకు 3-7స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చకచక అడుగులు వేస్తోంది. రాయితీలు, ల్యాండ్ లీజు తక్కువ ధరకు పాలసీలను తీసుకొస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రముఖ కట్టడాలను గాలికి వదిలేసింది. మూలకోన, తలకోన, చంద్రగిరి, కార్వేటినగరం కోట ఇలా అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. వీటిపై దృష్టి సారించాల్సి ఉంది
News December 18, 2025
అల్లూరి: 800 ఎకరాలలో పట్టుపురుగుల సాగు

పాడేరులోని అల్లూరి జిల్లా పట్టు పరిశ్రమ ప్రధాన కార్యాలయంలో స్కిల్ సమగ్ర-2 పథకంపై గురువారం పట్టు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ JC తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా పట్టు ఉత్పత్తిలో రైతులకు అవగాహన కల్పిస్తూ, 400మంది రైతులతో, 800ఎకరాలలో పట్టుపురుగుల సాగు చేస్తున్నామన్నారు. సంవత్సరంలో పది పంటలు తీసుకొని ప్రతి నెలా ఆదాయం పొందేలా చూస్తున్నామన్నారు.


