News January 29, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదం UPDATE.. ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15299553>>సిద్దిపేట<<>>కు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు ఆకుల కనకయ్య వియ్యంకుడు జంగిటి జనార్ధన్(55) చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కనకయ్య పెద్ద కొడుకుకి లివర్ నుంచి బ్లడ్ రావడంతో ప్రస్తుతం సర్జరీ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News December 22, 2025
విజయవాడలో నేడు ప్రభుత్వ క్రిస్మస్ సంబరాలు.. ఏర్పాట్లు పూర్తి.!

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏప్లస్ కన్వెన్షన్లో జరగనున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు CM చంద్రబాబు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు CM వేడుకల ప్రాంగణానికి చేరుకుంటారు. ఆదివారం సాయంత్రమే మంత్రి NMD ఫరూక్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రైస్తవ మత పెద్దలు, ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
News December 22, 2025
హిందువులారా మేల్కోండి.. కాజల్ పోస్ట్

బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హిందువులారా మేల్కోండి. మౌనం మిమ్మల్ని రక్షించదు’ అని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా చంపి చెట్టుకు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘ALL EYES ON BANGLADESH HINDUS’ అని క్యాప్షన్ పెట్టారు.
News December 22, 2025
ఏలూరు: ‘92.34 శాతం పల్స్ పోలియో పూర్తి చేశాం’

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని డీఎంహెచ్వో అమృతం స్పష్టం చేశారు. 2,00,004 మంది చిన్నారులకు 1,84,685 (92.34%) మంది పిల్లలకు మ్యానువల్గా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో నుంచి ఒక పిల్లవాడు కూడా తప్పిపోకుండా కృషి చేస్తున్నామన్నారు. 22, 23వ తేదీల్లో హౌస్ టు హౌస్ కార్యక్రమంలో నూరు శాతం పూర్తయ్యాల కృషి చేస్తామన్నారు.


