News January 29, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదం UPDATE.. ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15299553>>సిద్దిపేట<<>>కు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు ఆకుల కనకయ్య వియ్యంకుడు జంగిటి జనార్ధన్(55) చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కనకయ్య పెద్ద కొడుకుకి లివర్ నుంచి బ్లడ్ రావడంతో ప్రస్తుతం సర్జరీ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
పాలమూరు: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యూలర్, బ్యాక్లాగ్) డిగ్రీ పరీక్షలు నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్, మూడో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
News November 22, 2025
జనగామ: ఆదర్శం.. ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు!

ఉద్యోగ విరమణ పొందిన దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ్ రాజయ్య తాను పదవీ విరమణ పొందిన పాఠశాలలోనే విరమణ లేని విశ్రాంత ఉపాధ్యాయుడిగా బోధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతేడాది అక్టోబర్లో కడవెండి ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయుడిగా విరమణ పొందారు. ఏడాది నుంచి అదే పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెబుతున్న ఆయన్ను జనగామ అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అభినందించారు.


